Wednesday, May 8, 2024

హీరో మాధవన్ కు కరోనా

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభం అయింది. ప్రతి రోజు వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే ఈ మహమ్మరి బారిన పలువురు సినీ స్టార్స్ పాడగా తాజాగా నటుడు మాధవన్ కూడా ఆ లిస్ట్ లో చేరారు. ఈ విషయాన్ని ఆయనే సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని మాధవన్ తెలిపారు. తనను కలిసిన వారంతా కూడా టెస్టులు చేయించుకోవాలని కోరారు.

అలాగే హోం క్వారంటైలో ఉండాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని మాధవన్ కోరాడు. తనపై ప్రేమ చూపించే అభిమానులందరికీ ఆయన ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు మాధవన్.

Advertisement

తాజా వార్తలు

Advertisement