Tuesday, April 16, 2024

జగన్ ఓ ఫేక్ సీఎం: లోకేష్

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌పై ట్విట్టర్‌ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విరుచుకుపడ్డారు. ‘నిజ‌మేంటో జ‌నానికి తెలిసేస‌రికి.. జ‌గ‌న్‌రెడ్డి సృష్టించిన అబ‌ద్ధాలు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. అసత్య ప్రచారమే పెట్టుబ‌డిగా, తెచ్చుకున్న అధికారం అండ‌తో.. అమ‌రావ‌తిపై ప‌న్నిన మ‌రో కుట్రని టీడీపీ బట్టబయలు చేసింది’ అని ట్వీట్‌లో లోకేష్ పేర్కొన్నారు. ఫేక్ సీఎం ఆదేశాల‌తో, ఫేక్ ఎమ్మెల్యే ఆర్కే అసైన్డ్ రైతుల పేరుతో.. సీఐడీకి ఫేక్ ఫిర్యాదు ఇచ్చార‌ని, ఈ సంగతిని తాము ఆధారాల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టామని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజా రాజ‌ధాని అమ‌రావ‌తిపై, టీడీపీపై జగన్‌రెడ్డి కుతంత్రాలు ఆపాలని లోకేష్‌ ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement