Tuesday, April 30, 2024

Megastar: అయిదుగురు మ‌న‌వ‌రాళ్ల‌తో చిరంజీవి …

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కిన సంగతి తెలిసిందే. 2024 పద్మ పురస్కారాల్లో భాగంగా చిరుకు కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత అవార్డు వరించింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న కోడ‌లు ఉపాసన మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలుపుతూ అందమైన ఫోటో షేర్ చేసింది.

‘ఐదు బలమైన వేళ్లు కలిస్తేనే బలమైన పిడికిలి అవుతుంది. మా అందరికి ఆయన ల్లోనే కాదు దాతృత్వంలో కూడా. జీవితంలో నాన్నగా.. మామయ్యగా.. తాతయ్యగా ఉంటారు.. చిరుతని పద్మ విభూషణ్ తో సత్కరించారు’ అంటూ ఐదుగురు మనవరాళ్లతో చిరు ఉన్న ఫోటోను షేర్ చేసింది. అందులో పెద్ద కుమార్తెఓ సుష్మిత ఇద్దరు పిల్లలు.. చిన్న కుమార్తె శ్రీజ ఇద్దరు పిల్లలతో పాటు రామ్ చరణ్ డాట‌ర్ క్లింకారా కూడా ఉంది. గారాల మ‌న‌వ‌రాలు పాపాయి క్లీంకారను చిరు ఒడిలో కుర్చోబెట్టుకుని ఆడిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే క్లింకార ముఖం కనిపించకుండా బ్లర్ చేశారు ఉపాసన. ప్రస్తుతం ఈ ఫోటో వైరలవుతుండగా.. అందరి చూపు క్లింకార పైనే ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement