Friday, May 3, 2024

వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అయిన ‘‘బ్రహ్మాస్త్రం’’

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘‘బ్రహ్మాస్త్రం’’. ఈ మూవీ థియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను కూడా రాబట్టిన ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి రెడీ అవుతోంది.

కాగా, ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ బుల్లితెరపై అలరించడానికి సిద్దం అయ్యింది. ఈ నెల (ఏప్రిల్) 19వ తేదీన స్టార్ మా లో ఈ ప్రసారం కానుంది. అమితాబ్ బచ్చన్, మౌనీ రాయ్, అక్కినేని నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement