Sunday, May 5, 2024

కరోనా బాధితులను ఆదుకోండి….భూమి పెడ్నేకర్‌

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది వైద్యం అందక తిండి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి వారిని ఆదుకునేందుకు చాలామంది సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ భూమి పెడ్నేకర్‌ కరోనా కష్టకాలం లో ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాధితులను ఆదుకునేందుకు కృషి చేయాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. నా ఫ్యామిలీ ఈ భయంకరమైన వైరస్ తో పోరాడింది. నా తల్లి కరోనా సోకిన సమయం లో పడిన కష్టాన్ని నేను చూశాను. అప్పుడే నేను సాధ్యమైనంత మందికి సహాయపడాలని నిర్ణయించుకున్నాను.

అందుకే ప్రస్తుతం మేము 200 మంది వలంటీర్ల సాయంతో చేతనైన సహాయం చేస్తున్నాము. ఈ సాయం అందించే సమయంలో దోపిడీకి కూడా గురి కావలసి వస్తుంది. మనం చేసే సహాయం సరైన వ్యక్తులకు చేరిందా లేదా అని చూసుకోవాలి. కొన్ని చోట్ల పక్కదారి మందులు పక్క దారి పడుతున్నాయి. వాటి గుర్తిస్తే పోలీసులకు రిపోర్ట్ చేయండి అంటూ భూమి ఫడ్నేకర్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement