Sunday, May 5, 2024

యశ్, పూరీ సినిమాపై మరో అప్డేట్ !!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కే జి ఎఫ్ సినిమా తో ఒక్క రాత్రిలో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు రాక్ స్టార్ యశ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ 2 తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా తరువాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో యశ్ ఓ సినిమా చేయబోతున్నాడని గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ కాంబినేషన్ పై మరో వార్త బయటకు వచ్చింది. యశ్ 19వ చిత్రంగా ఇది తెరకెక్కనుందని… అలాగే పూరి కూడా ఇప్పటికే ఒక మంచి సాలిడ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియరావ్వట్లేదు. అధికారికంగా ఎవరో ఒకరు స్పందిస్తే కానీ…ఈ విషయం పై క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement