Sunday, April 28, 2024

సువేందు తండ్రి శిశిర్ అధికారికి వై ప్లస్ భద్రత

బెంగాల్ బీజేపీ శాసనసభా నేత సువేందు అధికారి తండ్రి, బెంగాల్ ఎంపీ శిశిర్ అధికారికి కేంద్ర ప్రభుత్వం వై ప్లస్ భద్రతను కల్పించింది. శిశిర్ అధికారితో పాటు ఆయన మరో తనయుడు దివ్యేందు అధికారికీ వై ప్లస్ భద్రతను ఇవ్వనుంది. అందులో భాగంగా సీఆర్పీఎఫ్ బలగాలు వారికి అంగరక్షకులుగా ఉంటారు.

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తృణమూల్ కాంగ్రెస్ రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తర్వాత శిశిర్ అధికారి కూడా బీజేపీలో చేరారు. తృణమూల్ లో తనకు మమత గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. అంతేకాదు ఎన్నికల ప్రచారం సందర్భంగా నందిగ్రామ్ నుంచి తనపై పోటీ చేసి గెలవాలని మమతకు సువేందు సవాల్ చేశారు. హోరాహోరిగా సాగిన నందిగ్రామ్ ఎన్నికల్లో సువేందు విజయం సాధించారు. దీంతో ఆయన్ను బీజేపీ శాసనసభా నేతగా ఎన్నికైయ్యారు. కాగా, బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ 77 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement