Thursday, May 2, 2024

ఏడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న యువ దర్శకుడు..

యువ దర్శకుడు విరించి వర్మ 2013లో రిలీజ్ అయిన ఉయ్యాల జంపాలా అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత నానితో మజ్ను సినిమా చేశాడు. 2016 సెప్టెంబర్లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు సాధించింది. అయితే, మజ్ను సినిమా తర్వాత విరించి మరో సినిమా చేయలేదు. అయితే, ఏడేళ్ల తరువాత ఇప్పుడు టాలీవుడ్‌లో మరో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు ఈ యువ దర్శకుడు.

విరించి తదుపరి సినిమా 70ల కాలం నాటి పీరియాడికల్ డ్రామా గా ఉండనున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం లైబ్రరీలలో సినిమాకి కావాల్సిన పరిశోధన చేస్తూ, ఇతర ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో బిజీగా ఉన్నారు. ఈ మూవీలో నందమూరి కళ్యాణ్రామ్ ప్రధాన పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మూవీ తారాగణం, సిబ్బందికి సంబంధించిన మరిన్ని అప్‌డేట్‌లు త్వరలోనే వెల్లడించునన్నారు.ః

Advertisement

తాజా వార్తలు

Advertisement