Monday, April 29, 2024

షాద్‌న‌గర్ లో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్..

షాద్‌న‌గర్, (ప్రభన్యూస్): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్‌లకు సంబంధించి బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను శంషాబాద్ ఎస్ఓటి సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజేశ్వర్ రెడ్డి, సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నారు. చెన్నై సూపర్ కింగ్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కు సంబంధించి స్థానిక యువత ముఠాగా ఏర్పడి బెట్టింగులకు పాల్పడ్డారు.

ఇందులో భాగంగా రూ.1 లక్షా 12 వేల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అదేవిధంగా ఆన్లైన్ నెట్ క్యాష్.. రూ.23,010గా ఉన్నట్టు ఎస్ఓటి సిఐ సత్యనారాయణ మీడియాకు తెలిపారు. షాద్ నగర్ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన సురేష్ ఈ బెట్టింగ్ నిర్వాహకుడిగా పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఫరూక్ నగర్ కు చెందిన పూల వ్యాపారం చేసుకునే షబ్బీర్, అయ్యప్ప కాలనీకి చెందిన యాదగిరి, ఇంద్రానగర్ కాలనీకి చెందిన ఎనుముల గణేష్,మచ్చ జంగయ్య, ఎనుముల రమేష్, ఎనుముల కిషోర్ మొత్తం ఏడుగురు యువకులను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు.

వీరంతా పరిగి రోడ్డులోని హనుమాన్ దేవాలయం పక్కన ఉన్న టీస్టాల్ వద్ద బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు ఎస్ఓటి పోలీసులు తెలిపారు. యువత బెట్టింగులకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సదరు ముఠా సభ్యులను స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పినట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement