Saturday, May 4, 2024

శ్రీదేవి తర్వాత నేనే అంటోన్న ‘కంగనా’

దివంగత స్టార్ హీరోయిన్ శ్రీదేవి తర్వాత కామెడీ పండించగలిగింది నేనేనని తెలిపారు బాలీవుడ్ హీరోయిన్ కంగనారనౌత్. తానొక అద్భుత నటినని..చెప్పారామె. తన కెరీర్‌ను తను వెడ్స్ మను సినిమా సమూలంగా మార్చేసిందని పేర్కొంది. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో కంగన కథానాయికగా నటించిన తను వెడ్స్ మను  విడుదలై పదేళ్లు పూర్తయ్యాయి.   ఈ సందర్భంగా కంగన ఆ సినిమాను గుర్తు చేసుకుంది. `నేను కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించాను. అయితే  తను వెడ్స్ మను  నా కెరీర్‌ను మార్చేసింది. ఆ సినిమాలో విభిన్నమైన కథ, నా నాటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ సినిమాలో కామెడీని అద్భుతంగా పండించగలిగాను. దిగ్గజ నటి శ్రీదేవి తర్వాత అంతలా కామెడీ పండించగలిగింది నేనేనని కంగన పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement