Friday, May 17, 2024

రూ. 100కోట్లు అందుకుంటోన్న హీరో..

బాహుబలి ఈ పేరు, ఈ సినిమా సృష్టించిన ప్రభంజనాలు ఎన్నో..ఈ చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పేరు ప్రపంచం అంతటా మారు మ్రోగిపోతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన రెండు భాగాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా చెలామణి అవుతున్నాడు ప్రభాస్.  ఆ సినిమాతో వచ్చిన మార్కెట్ గాలివాటం కాదు అని నిరూపించుకునే పనిలో పడ్డాడు ప్రభాస్. చాలా జాగ్రత్తగా యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథల వైపు అడుగులు వేస్తున్నాడు. అందుకే ప్రభాస్ నటించిన సినిమాలు వందల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి.బాహుబలి తర్వాత భారీ అంచనాలతో విడుదలైన సాహో కూడా హిందీలో అద్భుతమైన విజయం సాధించింది. సుజిత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాలీవుడ్ లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అక్కడ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ప్రభాస్ కూడా జెండా పాతేసాడు. అంతేకాదు ఈయనతో సినిమాల కోసం కేజిఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్, ఓం రౌత్ లాంటి పాన్ ఇండియన్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ప్రభాస్ హీరోగా నటించే సినిమాల కోసం వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. దీన్నిబట్టి ఆయన రేంజ్ ఏంటి అనేది అర్థం అవుతుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈయన ఒక్కో సినిమాకు 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. ఇండియాలో ఇప్పటి వరకు సినిమాకు 100 కోట్ల పారితోషికం ఎవరూ అందుకోలేదు. ఆ రికార్డు చేరుకున్న తొలి హీరోగా ప్రభాస్ చరిత్ర సృష్టించాడు. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు ఎందరో సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ వంద కోట్ల పారితోషికం ఎవరూ అనుకోలేదు. ప్రస్తుతం ఈయన రాధే శ్యామ్, సలార్, నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో రాధే శ్యామ్ జులై 30న విడుదల కానుంది. సలార్ 2022 సంక్రాంతికి విడుదల కానుంది. అలాగే ఆదిపురుష్ 2022 ఆగస్టులో విడుదలకు సిద్ధం అవుతుంది. 2023లో నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ కానుంది. ఏదేమైనా సినిమా సినిమాకు వంద కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement