Friday, May 3, 2024

‘రాధే’ కోసం రూ.235కోట్లు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఉండే క్రేజ్ ఏంటో అందరికి తెలిసిందే. కాగా ఆయన  నటించిన రాధే చిత్రానికి బిగ్ డీల్ కుదిరింది. ఈ చిత్రం ఈద్ కానుకగా రిలీజ్ కానుంది.  ఈ ఒప్పందం విలువ దాదాపు 235 కోట్లు.  ప్రఖ్యాత జీ స్టూడియోస్ ఈ డీల్ ని లాక్ చేసింది. గంపగుత్తగా పంపిణీ సహా ఇతర హక్కుల్ని కట్టబెట్టడం చర్చనీయాంశమైంది.రాధే పంపిణీ వీడియో- డిజిటల్ స్ట్రీమింగ్ సహా మ్యూజిక్ కి సంబంధించిన హక్కులను గంపగుత్తగా ఇంత పెద్ద మొత్తానికి చేజిక్కించుకున్నారట. తొలిగా థియేట్రికల్ విడుదల చేస్తారు. ఆ వెంటనే జీ 5లో రాధే ప్రసారం అవుతుంది. సల్మాన్ తో జీస్టూడియోస్ కి చాలాకాలంగా సత్సంబంధాలున్నాయి. దానిని మరింత బలోపేతం చేసుకునేందుకే ఇంత పెద్ద డీల్ కుదుర్చుకుందట. నిజానికి రాధే చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ పంపిణీ చేయాల్సి ఉండగా డీల్ కుదరలేదని తెలిసింది. క్రైసిస్ అనంతరం థియేట్రికల్ రిలీజ్ కి అండగా నిలిచిన సల్మాన్ ఖాన్  కి జీస్టూడియోస్ బాసటగా నిలుస్తోంది.  రాధేని దేశవ్యాప్తంగా థియేటర్లలోకి తేవాలన్నది ప్లాన్.  మే 20న రిలీజ్ కి వస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ తో పాటు రణదీప్ హుడా- దిశా పటాని- జాకీ ష్రాఫ్ తదితరులు నటించారు. ఈ చిత్రం జాన్ అబ్రహం నటిస్తున్న సత్యమేవ జయతే 2 తో బాక్సాఫీస్ వద్ద పోటీపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement