Tuesday, May 21, 2024

‘రంగు బొమ్మల కథ’ టైటిల్ పోస్టర్

ప్రశాంత్, మీనల్ లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ నూతన దర్శకుడు గోపాల కృష్ణ దర్శకత్వంలో లక్కీఫేస్‌ ఎంటర్టైన్‌మెంట్‌ బ్యానర్‌ పై నిర్మాత కమలాకర్‌ రాచకొండ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నంబర్ 1 రంగు బొమ్మల కథ చిత్రం  హైదరాబాద్‌, ఫిల్మ్‌నగర్‌ కల్చరల్‌ సెంటర్‌లో పూజా కార్యక్రమాలతో షూటింగ్‌ ప్రారంభమైంది.  ముందుగా దైవ సన్నిధానంలోని సాయి బాబా గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్బంగా టైటిల్ పోస్టర్ కూడా లాంచ్ చేసారు. అనంతరం హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ సీనియర్‌ దర్శకుడు ఎస్‌.వి. కృష్ణారెడ్డి గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి క్లాప్‌కొట్టారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ సొహైల్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement