Friday, May 17, 2024

సాగ‌ర్ ఉప ఎన్నికల బ‌రిలో టిడిపి అభ్య‌ర్ధిగా అరుణ్ కుమార్

హైదరాబాద్‌: నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. పార్టీ అభ్యర్థిగా మువ్వ అరుణ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఉపఎన్నికలో పోటీ చేసే అభ్య‌ర్ధిని అధికారికంగా ప్ర‌క‌టించారు.. కాగా, నాగార్జునసాగర్ టిఆర్ ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్రధాన పార్టీలు .. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు దీటుగా కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో దూసుకువెళుతున్నాయి.. పోటీ చేసే అభ్య‌ర్ధుల ఎంపిక‌పై ఈ మూడు పార్టీలు త‌ల‌మునక‌లై ఉన్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement