Tuesday, July 23, 2024

Tributes – రాజీవ్ గాంధీకి ముఖ్య‌మంత్రి రేవంత్ నివాళి

ఐటీ రంగ వృద్ధికి రాజీవ్‌ గాంధీ బాటలు వేశారని సీఎం రేవంత్‌రెడ్డి కొనియాడారు. రాజీవ్‌గాంధీ వర్ధంతి సంద‌ర్భంగా నగరంలోని సోమాజిగూడలో నేడు నిర్వ‌హించిన కార్య‌క్రమంలో ఆయ‌న పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూల‌మాలలు వేసి నివాళి అర్పించారు.ఈ సంద‌ర్భంగా రేవంత్ మాట్లాడుతూ, ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డి, వి.హనుమంతరావు, షబ్బీర్ అలీ, పార్టీ రాష్ట్ర వ్యవహవారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

ఇది ఇలా ఉంటే ఖమ్మం జిల్లా కూసుమంచిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్‌ అక్కడి న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement