Friday, July 26, 2024

Good News – త‌డిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తాం ….రైతుల‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి భరోసా…


తెలంగాణలో గతకొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైంది. ధాన్యం అమ్మేందుకు మార్కెట్లకు తీసుకొచ్చినా.. సరైన సౌకర్యాలు లేకపోవటంతో వర్షానికి తడిసి మెులకెత్తుతున్నాయి. దీంతో అన్నదాతలు పరేషాన్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గుడ్‌న్యూస్ చెప్పారు. తడిచిన ధాన్యం కూడా కొంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు.

- Advertisement -

గాంధీభ‌వ‌న్ లో ఆయ‌న నేడు మీడియాతో మాట్లాడుతూ, అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వారిని ఆదుకుంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వంపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి సీరియస్ అయ్యారు. ఇది సరైన విధానం కాదని అన్నారు. అబద్ధాలు చెప్పడం బీఆర్ఎస్ నేతలకు అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.

సీజ‌న్ కు 15 రోజుల ముందు నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి వ‌డ్డ‌ను కొంటున్నామని ఆయన వెల్లడించారు. గతంలో కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామన్నారు. కొన్న ధాన్యానికి కేవ‌లం మూడు రోజుల‌లోనే రైతుల ఖాతాల‌లో న‌గ‌దును జ‌మ చేస్తున్నామ‌ని చెప్పారు..

తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదని భట్టి విమర్శించారు. తమ ప్రభుత్వంలో తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్‌పీ ఇచ్చి కొంటామని అన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామ‌ని.. రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని అన్నారు. రైతులందరూ ధైర్యంగా ఉండాలని సూచించారు. అలాగే రైత‌న్న‌లు ఆధునిక సాంకేతిను
అందిపుచ్చుకోవాలని.. వాతావరణ శాఖ సూచనలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటిని అసురించాల‌ని కోరారు భ‌ట్టి

Advertisement

తాజా వార్తలు

Advertisement