Monday, May 6, 2024

ముంబైలో మకాం..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సాహో చిత్రాన్ని తెరకెక్కించి ఇండియా వైడ్ గా గుర్తింపు పొందారు డైరెక్టర్ సుజిత్. కాగా సాహో తెలుగు వెర్షన్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినా హిందీలో మంచి టాక్ తెచ్చుకుంది. అయితే సుజిత్ ప్రస్తుతం జీ స్టూడియోతో కలిసి హిందీ చిత్రాన్ని చేయనున్నారట. పాపులర్ హీరో ఈ ప్రాజెక్టులో నటిస్తారని టాక్. బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ కు యాక్షన్ థ్రిల్లర్ కథని వినిపించాడట సుజిత్.ఇటీవ‌లే త‌న స్నేహితురాలిని పెండ్లి చేసుకొని ఓ ఇంటివాడైన సుజీత్ ముంబైకి మ‌కాం మార్చారట‌. మొత్తానికి తీసింది ఒక‌టి రెండు సినిమాలే అయినా సుజీత్ చాలా కాన్ఫిడెంట్‌గా ఇక బాలీవుడ్‌పై త‌న ఫోక‌స్ పెట్ట‌బోతున్నట్టు బీటౌన్‌లో వార్త చ‌క్క‌ర్లు కొడుతోంది. అర్జున్ రెడ్డి చిత్రం ఘ‌న విజయం సాధించిన త‌ర్వాత డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా ముంబైకి షిప్ట్ అయ్యాడు. సందీప్ రెడ్డి త‌ర్వాత ముంబైకి మ‌కాం మార్చిన రెండో డైరెక్ట‌ర్ సుజీత్ కావ‌డం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement