Friday, May 3, 2024

ఎమ్మెల్సీ స్థానం గెల‌వాల్సిందే – గ్రేట‌ర్ టి ఆర్ ఎస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కెటిఆర్ క్లాసు..

హైదరాబాద్‌: హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో టిఆర్ ఎస్ అభ్య‌ర్ధిగా బ‌రిలో నిలిచిన వాణిదేవిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు అంద‌రూ స‌మీష్టిగా కృషి చేయాల‌ని టిఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కెటిఆర్ కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రజాప్రతినిధులతో కేటీఆర్‌ భేటీ అయ్యారు. తెలంగాణ భవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి జీహెచ్‌ఎంసీ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్‌, డిప్యూటీ మేయర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహంపై ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు దిశ నిర్దేశం చేశారు..ప్ర‌తి ఒక్క‌రూ అంద‌రిని క‌లుపుకుని ప్ర‌చారంలో ముందుకు సాగాల‌ని కోరారు.. ప్ర‌తి ఒక్క ఓట‌రు క‌ల‌సి విధంగా టిఆర్ ఎస్ ప్ర‌జా ప్ర‌తినిధులు కృషి చేయాలంటూ దిశ‌నిర్ధేశం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement