Monday, May 6, 2024

మిస్టర్ జీనియస్ గా మిస్టర్ ఫర్ ఫెక్ట్

ఒక్కోసారి అంతే ఎంత మంచి సినిమా కథ అయినా వారికి డేట్స్ ఖాళీ లేకపోతే వదులుకోవాల్సిందే ఆ చిత్రాన్ని. అలాగే తమిళ స్టార్ హీరో  ధనుష్ బిజీ షెడ్యూల్ కారణంగా విశ్వనాథ్ ఆనంద్ బయోపిక్ ప్రాజెక్ట్ బాలీవుడ్ మిస్టర్ ఫెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ వద్దకు వెళ్లిందట. మిస్టర్ జీనియస్ చెస్ ఛాంపియన్ విశ్వనాధ్ ఆనంద్ బయోపిక్ అంటే ఆ రేంజ్ నటుడు అయితేనే న్యాయం చేయగలడు అనే ఉద్దేశ్యంతో అమీర్ ఖాన్ వద్దకు తీసుకు వెళ్లారని అంటున్నారు. ఆయన కూడా ప్రస్తుతం చేస్తున్న సినిమా తర్వాత చేసేందుకు ఓకే చెప్పాడని తెలుస్తోంది. త్వరలోనే బాలీవుడ్ సూపర్ స్టార్ అమీన్ ఖాన్ ప్రధాన పాత్రలో మిస్టర్ జీనియస్ ఆనంద్ విశ్వనాథ్ బయోపిక్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ధనుష్ ఈ ప్రాజెక్ట్ ను వదులుకోవడం పట్ల పలువురు ఆయన తీరుపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప బయోపిక్ చేజేతుల వదులుకున్నావు అంటూ ధనుష్ పై కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement