Friday, April 26, 2024

టీమ్ ఇండియాకు గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై అభినంద‌న‌లు..

హైదరాబాద్ : చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రెండో టెస్టులో ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించిన కోహ్లీ సేనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలుగులో ట్వీట్ చేశారు. చెన్నై చెపాక్ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన టీం ఇండియాకు శుభాకాంక్షలు అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు. బ్యాటింగ్, బౌలింగ్‌లో గొప్ప ప్రదర్శన చేశారంటూ అశ్విన్‌కు అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement