Sunday, May 19, 2024

‘మహేశ్’ ఫ్యాన్స్ కోసం

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇవ్వనున్నారట సర్కారు వారి పాట చిత్ర యూనిట్. దుబాయ్ షెడ్యూల్ ముగిసిన త‌ర్వాత హైద‌రాబాద్‌లో మిగ‌తా మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే ఫిబ్ర‌వ‌రి 21న సెకండ్ షెడ్యూల్ కూడా ముగుస్తుంది కాబ‌ట్టి ఆ రోజు ఫ్యాన్స్‌ను అల‌రించేందుకు చిన్న వీడియోను విడుద‌ల చేయాల‌ని సర్కారు వారి పాట చిత్ర బృందం భావిస్తుంది. ఇందులో దుబాయ్ లోని అద్భుత‌మైన లొకేష‌న్స్‌ను చూపించ‌నున్నార‌ని టాక్.  సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ 27వ చిత్రం స‌ర్కారువారి పాటమూవీని  మైత్రీ మూవీమేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్ నిర్మిత‌మ‌వుతుంది. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుద‌లవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement