Monday, April 29, 2024

బాస‌ర‌లో వసంత పంచ‌మి వేడుక‌లు – పోటెత్తిన భ‌క్త జ‌నం…

నిర్మల్ – బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచే చదువుల తల్లి సరస్వతి క్షేత్రం ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పట్టనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అమ్మవారి పుట్టిన రోజు సందర్భంగా ఆలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాస పూజలు, కుంకుమార్చనలు అమ్మవారి సన్నిధిలో భారీగా చేస్తున్నారు. నేటి నుంచి మూడు రోజుల పాటు వసంత పంచమి వేడుకలు నిర్వహించనున్నారు. కాగా, వసంత పంచమి సందర్భంగా సరస్వతి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ..దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని అన్నారు. బాసర ఆలయన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను ఖర్చు చేస్తుందని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. మంత్రి అల్లోల తో పాటు ముదోల్ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement