Sunday, May 19, 2024

‘పీకే’కి సీక్వెల్ పక్కా

మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రానికి సీక్వెల్ రానుందట.  2014లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అగ్ర దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ రూపొందించిన ఈ చిత్రం భారత్‌లోనే కాదు.. చైనాలో కూడా కాసుల వర్షం కురిపించింది. అమిర్ ఖాన్, హిరాణీ ప్రతిభకు అందరూ సలాం చేశారు. త్వరలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోందట. అయితే ఆ సీక్వెల్‌లో హీరో అమిర్ కాదు.. రణ్‌బీర్ కపూర్ అట.పీకే క్లైమాక్స్‌లో రణ్‌బీర్ కపూర్‌ను పరిచయం చేశారు. రణ్‌బీర్ కపూర్‌ పరిచయంతో ఆ సినిమా ముగుస్తుంది. ఈ సీక్వెల్‌ను అక్కడి నుంచే ప్రారంభిస్తారట. ఈ విషయాన్ని నిర్మాత విధు వినోద్ చోప్రా తాజాగా వెల్లడించారు. పీకేకు సీక్వెల్ కచ్చితంగా ఉంటుంది. సినిమా చివరలో రణబీర్‌ను చూపించాం. కాబట్టి చెప్పడానికి ఇంకా కథ ఉంది. అయితే అభిజిత్ జోషి ఇంకా సీక్వెల్ కథ రాయలేదు. అతను ఆ కథ రాయడం పూర్తి చేయగానే షూటింగ్ మొదలవుతుందని విధు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement