Thursday, May 16, 2024

నాన్ స్టాఫ్ వర్క్ కావాలి..

పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న చిత్రం లైగర్. ఈ చిత్రాన్ని దర్శకుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు. ఛార్మి..కరణ్ జోహార్ లు కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది.  రీసెంట్‌గా ముంబైలో చిత్ర షూటింగ్ తిరిగి మొద‌లు పెట్టారు. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఇస్తూ వ‌స్తున్న ఛార్మి లైగ‌ర్ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలిపారు. లైగర్ ఎక్స్‌పీరియెన్స్‌కు సంబంధించిన విష‌యాల‌ని తాజాగా షేర్ చేసుకున్న విజ‌య్ దేవ‌రకొండ‌.. చాలా రోజుల త‌ర్వాత షూటింగ్‌లో పాల్గొన‌డం ఎగ్జైటింగ్‌గా ఉంది. పూరీ స‌ర్‌ని ఎలాంటి బ్రేక్స్ లేకుండా  టైట్ షెడ్యూల్ ప్లాన్ చేయ‌మ‌ని చెప్పాను. అవ‌స‌ర‌మైతే  నేను నా రూంకు కూడా వెళ్ల‌కుండా లైగ‌ర్ సెట్‌లోనే ప‌డుకుంటాన‌ని అన్నాను. నాకు ఇప్పుడు విశ్రాంతి అవ‌స‌రం అనిపించ‌డం లేదు. నాన్ స్టాప్ వ‌ర్క్ కావాల‌ని కోరుకుంటున్నాను అని విజ‌య్ చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement