Friday, May 3, 2024

ఓటీటీకి ప్రత్యేకంగా ప్రేక్షకులున్నారు..

ఓటీటీ గురించి మాట్లాడింది బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్.  ప్ర‌స్తుతం అక్ష‌య్‌కుమార్ తో క‌లిసి న‌టిస్తోన్న‌ బ‌చ్చ‌న్ పాండే చిత్రంతో బిజీగా ఉంది. దీంతోపాటు మ‌రో రెండు చిత్రాలు కూడా చేస్తోంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ అనేది బిగ్ స్క్రీన్ నుంచి ఓటీటీ వైపు ఎలా సాగుతుంద‌నే విష‌యంపై చిట్‌చాట్‌లో మాట్లాడింది కృతిస‌నన్. ఓటీటీకి ప్ర‌త్యేకంగా ప్రేక్ష‌కులున్నారు. నేను కూడా ఓటీటీలో సినిమాలు చూసి ఎంజాయ్ చేశా. బాక్సాపీస్ నంబ‌రింగ్ గురించి ఆలోచించే అవ‌స‌రం లేకుండా నువ్వు ఏం తీయాల‌నుకుంటున్నావో..అది రూపొందించే అవ‌కాశం ఉంటుంది. ఆన్‌లైన్‌లోకి వెళ్లిన త‌ర్వాత నంబ‌ర్ గురించి మాట్లాడే అవ‌కాశం ఉండ‌దు. ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం ఏదైనా ఒక ప్రాజెక్టు చేయాల‌నుకుంటున్నా. చురుకైన పాత్ర‌తో ఇదివ‌ర‌కెన్న‌డూ చేయ‌ని ప్ర‌య‌త్నం చేయాల‌నుకుంటున్న‌ట్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement