Friday, April 26, 2024

ఎన్టీఆర్ షోలో సందడి చేయనున్న మహేష్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా హోస్ట్ గానూ మారి బుల్లితెర వీక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన “ఎవరు మీలో కోటీశ్వరులు” అనే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ షోకు సూపర్‌స్టార్ మహేష్ బాబు హాజరవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. టెలికాస్ట్ తేదీని ఇంకా నిర్ణయించలేదు. అన్ని వర్గాల ప్రేక్షకులలో మహేష్ బాబుకు ఉన్న ప్రజాదరణతో ఎపిసోడ్‌కు అసాధారణమైన రేటింగ్‌లు వచ్చే అవకాశం ఉందని షోను ప్రసారం చేస్తున్న టీవీ 7యాజమాన్యం భావిస్తోందట. ఇక ఎన్టీఆర్, మహేష్ బాబు మధ్య ఉన్న స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. షో నిర్వాహకులు పాపులారిటీని పెంచడానికి సెలబ్రిటీలతో ప్రయోగం చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి, కొరటాల శివ ఈ షోకు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: 11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు

Advertisement

తాజా వార్తలు

Advertisement