Friday, April 26, 2024

11 మంది టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు

టీడీపీ నేతలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదయింది. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటి వద్ద వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యే జోగి రమేష్ కారు కూడా ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో 11 మంది టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. పట్టాభి, గొట్టిముక్కల, రఘురామరాజు, చెన్నుపాటి గాంధీ, నాగూల్ మీరా, గద్దె రామ్మోహన్ రావు, సుంకర విఘ్ణ, నాదెండ్ల బ్రహ్మం, బోడె ప్రసాద్, జంగాల సాంబశివరావు, బుద్దా వెంకన్న, తమ్మా శంకర్ రెడ్డి సహా గుర్తు తెలియని మరో 30 మంది దాడిలో పాల్గొన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండిః అక్టోబరు 10న మా ఎన్నికలు.. జీవితపై రఘుబాబు పోటీ

Advertisement

తాజా వార్తలు

Advertisement