Tuesday, April 23, 2024

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు

ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏపీలో మొత్తం 10,047 ఎంపీటీసీ స్థానాలు, 660 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 2,371 ఎంపీటీసీ స్థానాలు, 126 జడ్పీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి.

ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కౌంటింగ్ ఏజెంట్లకు, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖలో 90 మంది కౌంటింగ్ ఏజెంట్లకు కరోనా టెస్టులు నిర్వహించగా, వారిలో 29 మందికి పాజిటివ్ అని వెల్లడి కావడం కలకలం రేపింది. కరోనా సోకిన వారిని ఐసోలేషన్ కు తరలించాలని విశాఖ జాయింట్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టులో నెగెటివ్ వచ్చినవారినే కౌంటింగ్ ఏజెంట్లుగా అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు.

గతంలో సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే గోస్వామి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. ఏడాది ఏప్రిల్ 8న జరిగిన ఎన్నికల ప్రక్రియను సమర్ధించిన ధర్మాసనం.. కౌంటింగ్ కు అనుమతిస్తూ తీర్పునిచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1న ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా ఏప్రిల్‌ 8న రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. అయితే, పరిషత్ ఎన్నికల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఉందని, సరైన కాలపరిమితి లేకుండా ఎన్నికలు నిర్వహించారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు సింగిల్ జడ్జ్ ధర్మాసనం మే 21న న్నికలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు ఎన్నికల కోడ్‌ విధించాలని.. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్‌ ఉందన్నారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్‌ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్‌ విధించాలని స్పష్టం చేశారు.  సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ తో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు డివిజనల్ బెంచ్ లో అప్పీల్ చేశారు. . వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. గురువారం(సెప్టెంబర్ 16) ఓట్ల లెక్కింపునకు పచ్చజెండా ఊపుతూ తీర్పును వెల్లడించింది.

ఇది కూడా చదవండిః ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు… కొత్త నిబంధనలు ఇవే..


Advertisement

తాజా వార్తలు

Advertisement