Thursday, March 28, 2024

గుంటూరు జిల్లా తాడికొండలో నిలిచిపోయిన కౌంటింగ్

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్ జోరుగా సాగుతోంది. అయితే గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో మాత్రం కౌంటింగ్ నిలిచిపోయింది. బేజాత్‌పురం ఎంపీటీసీ, రావెల ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాగా, బాక్సుల్లోని బ్యాలెట్లు తడిచిపోవడంతో లెక్కింపు ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఈ రెండు స్థానాల్లో కౌంటింగ్‌పై సందిగ్ధత నెలకొంది. పేపర్లు తడిచిపోవడంతో కౌంటింగ్ ప్రక్రియను నిలిపివేసిన విషయాన్ని అక్కడి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేశారు. ౌ

అలాగే మరికొన్ని బాక్సుల్లోని బ్యాలెట్ పేపర్లకు చెదలు కూడా పట్టినట్టు తెలుస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత చాలాకాలం పాటు బాక్సులు చీకటి గదుల్లో ఉండిపోవడం వల్లే వాటికి చెదలు పట్టినట్టు తెలుస్తోంది. మొత్తం బాక్సులను తెరిస్తే కానీ ఎన్ని బ్యాలెట్లు పాడైపోయాయన్న విషయం తెలియదని సిబ్బంది తెలిపారు. కాగా, బ్యాలెట్లు తడిచిపోయి పనికిరాకుండా పోవడంతో బేజాత్‌పురం, రావెల స్థానాల్లో రీపోలింగ్ నిర్వహిస్తారా? లేక, కౌంటింగ్ కొనసాగిస్తారా? అన్న విషయం తెలియరాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement