Sunday, May 5, 2024

JIO ఎయిర్‌ఫైబర్‌లో రెండు కొత్త ప్లాన్స్‌…

జియో ఎయిర్‌ఫైర్‌ వినియోగదారుల కోసం రిలయన్స్‌ జియో మరో రెండు కొత్త ప్లాన్స్‌ను తీసుకు వచ్చింది. ఇవి రెగ్యులర్‌ ప్లాన్స్‌ కావని తెలిపింది. ఇవి అదనపు డేటా వినియోగం కోసం డేటా బూస్టర్‌ ప్లాన్స్‌. వీటి ధర రూ. 101, 251గా జియో నిర్ణయించింది. గతంలో డేటా బూస్టర్‌ కోసం 401 ప్లాన్‌ను జియో ప్రకటించింది. జియో ఎయిర్‌ఫైబర్‌ సేవలు దేశవ్యాప్తంగా దీపావళి నుంచి అందుబాటులోకి వచ్చాయి.

దాదాపు 500 పట్టణాల్లో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. వైర్‌ అసరం లేని 5జీ ఆధారిత ఎయిర్‌ ఫైబర్‌ కోసం రెగ్యులర్‌, మ్యాక్స్‌ పేరుతో మొత్తం ఆరు బేసిక్‌ ప్లాన్స్‌ను జియో అందిస్తోంది. ఈ ప్లాన్లలో గరిష్టంగా 1 టీబీ డేటా అభిస్తుంది. జియో కొత్తగా తీసుకు వచ్చిన రూ. 101 ప్లాన్‌తో 100 జీబీ డేటా లభిస్తుంది. రూ.251 ప్యాక్‌తో 500 జీబీ డేటా లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement