Thursday, May 2, 2024

ఎంబిఎస్‌ జువెల్లర్స్‌ ఎండి సుఖేష్‌ గుప్తా అరెస్ట్.. 149 కోట్ల బంగారం, 1.96 కోట్ల నగదు స్వాధీనం

హైదరాబాద్‌ ఆంధ్రప్రభ : ఎంబిఎస్‌ జువెల్లర్స్‌ ఎండి సుఖేష్‌ గుప్తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రుణాల ఎగవేత, ఫెమా నిబంధనల ఉల్లంఘనతో సహా పలు ఆరోపణలపై సుఖేష్‌ గుప్తాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. మొత్తం ఆరు కేసుల్లో సుఖేష్‌ గుప్తా మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్నారు. బంగారం వ్యాపారం చేస్తూ అక్రమాలకు పాల్పడిన అభియోగంతో రెండు రోజల పాటు తనఖీలు నిర్వహించిన ఈడీ అధికారులు సుఖేష్‌ గుప్తాకు చెందిన సంస్థలలో పెద్ద ఎత్తున బంగారం , బంగారు ఆభరణాలు, వజ్రాలు స్వాధీనం చేసుకుని ఆయన్ను అరెస్టు చేశారు. తాజగా సుఖేష్‌ గుప్తా వ్యవహారంపై ఈడీ అధికారిక ప్రకటన చేసింది.

సుఖేష్‌ గుప్తాను అరెస్టు చేశామని ప్రకటించింది. సుఖేష్‌ గుప్తా షో రూముల్లో రూ. 149 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 1.96 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. 2019లో ఎంఎంటిఎస్‌ బంగారం కొనుగోళ్లకి సంబంధించి సోదాలు జరిపామని ప్రకటించారు. రూ. 504 కోట్ల రుణం తీసుకుని ఎగ్గొట్టారన్న ఆరోపణలపై సోదాలు జరిపినట్లు పేర్కొన్నారు. గతంలో వన్‌టైం సెటిల్‌మెంట్‌ ఇచ్చినా రుణం చెల్లింపులో సుఖేష్‌ గుప్తా విఫలం చెందారని తెలిపారు. ప్రస్తుతం సుఖేష్‌ గుప్తాకు చెందిన ఎంబిఎస్‌ మసద్దీలాల్‌ జువెల్లరీస్‌లలో సోదాలు పూర్తి చేశామని ప్రకటించారు. కేంద్రం ఆధీనంలో నడిచే ఎంఎంటిఎస్‌ను సుఖేష్‌ గుప్తా పెద్ద మొత్తంలో మోసం చేసినట్టు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement