Tuesday, May 21, 2024

రాష్ట్ర వ్యాప్త ఉప ఎన్నికలలో వైకాపాదే విజయం : జివిఎంసి విజయసాయి

విశాఖపట్నం, (ప్రభన్యూస్‌ బ్యూరో): ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి జనరంజన పాలన ఫలితంగా రాష్ట్ర ప్రజలు ఆయనపై ఎనలేని అభిమానం చూపుతున్నారని ఈ నేపధ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికలలో వైకాపా విజయం తధ్యమని రాజ్యసభ సభ్యలు, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయి రెడ్డి అన్నారు. శనివారం జివిఎంసి 31 వ వార్డులో జరిగిన గడపగడపకీ ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో విజయసాయిరెడ్డి పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఉప ఎన్నికల పలితాలే 2024లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు రిఫరెండంగా నిలుస్తాయన్నారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరుగు అన్ని స్థానాలతో పాటు- కుప్పంలో కూడా వైకాపా విజయకేతనం ఎగరవేస్తుందన్నారు.

ఎన్నికల ప్రచారంలో ప్రజలనుండి విశేష స్పందన గుర్తించామని గతంలో తేదేపాకు మద్దత్తుగా నిలిచిన వారు ఇప్పుడు స్వచ్చందంగా వైకాపాకు తోడుగా నిలుస్తున్నారన్నారు. కుప్పంలోనూ ఓడిపోతామన్న భయంతోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తేదేపా నాయకులకు కుప్పంకి తోడుకుపోయాడని పేర్కొన్నారు. 2024 లో సార్వత్రిక ఎన్నికల అనంతరం తేదేపా పూర్తిగా తుడుచుపెట్టు-కుపోతుందని, ఆ పార్టీ వేరే పార్టీలో విలీనం చేయడంగానీ, లేక పార్టీకి నూతన నాయకుడు సారద్యం వహించడం గానీ జరుగుతుందన్నారు. 31 వ వార్డులో గతంలో తెదేపా అభ్యర్థి గెలుపొందారని, ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికలలో వైకాపా విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement