Thursday, May 9, 2024

టీఎస్ ఐసెట్ తొలి ద‌శ‌ సీట్ల కేటాయింపు

టీఎస్ ఐసెట్ తొలి ద‌శ సీట్ల కేటాయింపు ఆదివారం జ‌రిగింది. తొలి ద‌శ‌లో సీట్లు పొందిన అభ్య‌ర్థులు ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల‌కు క‌లిపి మొత్తం 26,845 సీట్లు ఉండ‌గా, తొలి ద‌శ‌లో 19,209 సీట్లు కేటాయించ‌బ‌డ్డాయి. ఇంకా 7,636 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఫ‌స్ట్ ఫేజ్‌లో 28 కాలేజీల్లో 100 శాతం సీట్లు నిండిన‌ట్లు అధికారులు పేర్కొన్నారు. టీఎస్ ఐసెట్ -2021లో మొత్తం 51,136 మంది అభ్య‌ర్థులు క్వాలిఫై కాగా, 21,811 మంది వెబ్ ఆప్ష‌న్స్ ఇచ్చుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు 272 ఉన్నాయి. సీట్ అలాట్‌మెంట్ కాపీ కోసం https://tsicet.nic.in/default.aspx వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement