Thursday, May 2, 2024

వైఎస్ వివేకా హ‌త్య కేసు : గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి ల‌ పిటీషన్ కొట్టివేత

వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య కేసుపై ఈరోజు హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నిందితులుగా ఉన్న గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాలు చేస్తూ గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ పిటీషన్లను కేసు కొట్టివేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తమను సీబీఐ అన్యాయంగా ఇరికించిందని వారు గతంలోనూ కోర్టును ఆశ్రయించారు. తాజాగా దస్తగిరిని అప్రూవర్ గా మారడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement