Wednesday, May 15, 2024

శ్రీవారిని ద‌ర్శించుకున్న హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం ‘జైరామ్ ఠాకూర్’

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. ఆయ‌న కుటుంబ‌స‌భ్యుల‌తో స్వామివారిని ద‌ర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆలయానికి చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జై రామ్ ఠాకూర్ కు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ ఛైర్మన్‌, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కలసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement