Thursday, May 2, 2024

ఈ నెల 28న నిమ్మ‌కూరులో ఎన్టీఆర్ విగ్ర‌హావిష్క‌ర‌ణ – మంత్రి కొడాలి నాని

మాజీ ముఖ్య‌మంత్రి, న‌టుడు ఎన్టీఆర్ కాంస్య విగ్ర‌హాన్ని ఆయ‌న స్వ‌స్థ‌లం నిమ్మ‌కూరులో ఏర్పాటు చేయాల‌ని సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యించార‌ని మంత్రి కొడాలి నాని మీడియాకి తెలిపారు. నిమ్మకూరులో 14 ఎకరాల చెరువు ప్రాంతంలో 25 అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని నెలకొల్పుతామని, ఈ నిర్మాణానికి ఈ నెల 28న శంకుస్థాప‌న చేస్తార‌ని, ఎన్టీఆర్ శ‌త జ‌యంతినాడు ఆ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తార‌ని చెప్పారు. అనంత‌రం ఎమ్మెల్యే కైలే అనిల్‌ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ బంధువులు నిమ్మకూరులో తాగునీటి సమస్యను కూడా తెలిపార‌ని .. వెంటనే స్పందించిన జ‌గ‌న్ ఆ సమస్య పరిష్కారానికి రూ.కోటి మంజూరు చేశారని వివ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement