Sunday, May 12, 2024

AP | జనసేనలో చేరిన వైసీపీ ఎంపీ బాలశౌరి.. జగన్‌పై సంచలన వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ బాలశౌరి జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు.

జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని అనుకున్నాం కానీ జగన్ పాలనలో ఏపీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదని విమర్శించారు. ‘సిద్ధం’ అంటూ మీటింగ్‌లు పెడుతున్న వైసీపీ దేనికి సిద్ధమని, పారిపోవడానికి సిద్ధమా అంటూ సెటైర్లు వేశారు. తాను ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదని జ‌గ‌న్ చెబుతారు.. కానీ జగన్ ఇస్తున్న హామీలన్నీ అబద్దాలే అని ఎద్దేవ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement