Sunday, April 28, 2024

Manikonda | క్యాన్సర్ పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం : ధూళిపాళ్ల

మణికొండ: క్యాన్సర్ వ్యాధి పట్ల అవగాహన ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరికి అవసరం అని పంచవటి సాయిలక్ష్మి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ధూళిపాళ్ల సీతారాం అన్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆదివారం స్థానికి కమ్యూనిటి హాల్ లో అరేటి హాస్పిటల్ వారు నిర్వహించిన క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు , నివారణకు కావాల్సిన మందుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు..


నగరంలో నూతనంగా ప్రారంభిచిన అరేటి హాస్పిటల్ సౌజన్యంతో తమ కాలనీ వాసుల ఆరోగ్య సంక్షేమం కొసం ఉచితంగా క్యాన్సర్ హెల్త్ క్యాంపు నిర్వహించడం సంతోషంగా ఉంది అన్నారు. ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.. సకాలంలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేసుకుంటే నివారణ సులువుగా ఉంటుందన్నారు. క్యాన్సర్ పట్ల సమాజంలో ఇంకా చైతన్యం రావాలని అందుకు హాస్పిటల్ వారు చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు. వారికి తమవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు అరేటి హాస్పిటల్ క్యాన్సర్ వ్యాధి వైద్యులు, భవ్య, శిల్ప , కరణ్ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement