Wednesday, May 8, 2024

TSRTC కండక్టర్లపై దాడి.. యువతి అరెస్ట్!

టీఎస్‌ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల దాడి చేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హయత్ నగర్ డిపో-1కి చెందిన ఇద్దరు కండక్టర్లపై దాడి చేసిన కేసులో నిందితురాలు సయ్యద్ సమీనాను రాచకొండ కమిషనరేట్ ఎల్బీనగర్ పోలీసులు ఇవ్వాల (ఆదివారం) అరెస్ట్ చేశారు. ఈ కేసులో సయ్యద్ సమీనాకు రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

కాగా, ఈ కేసు దర్యాప్తును త్వరగా చేపట్టి నిందితురాలిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తెలిపారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించిన, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించేది లేదని వెల్లడించారు. వేలాది మంది టిఎస్‌ఆర్‌టిసి ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీసే, మానసిక క్షోభ కలిగించే ఇలాంటి సంఘటనలకు పాల్పడవద్దని వారికి విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement