Monday, April 29, 2024

వైద్యశాఖలో 40వేల పోస్టులను భర్తీ చేస్తాం.. సీఎం జగన్

వైద్యశాఖలో 40వేల పోస్టులను భర్తీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ… త్వరలో మరో 5వేల పోస్టులు భర్తీ చేస్తామన్నారు. రూ.12,268కోట్లతో మెడికల్ కాలేజీల్లోనూ నాడు-నేడు చేయిస్తామన్నారు. 17కొత్త మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నామన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను తీసుకొస్తున్నామన్నారు. ఐదు ఊళ్లకు ఒక డాక్టర్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. నెలకు రెండు మూడు సార్లు ఒక గ్రామానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement