Monday, April 29, 2024

కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు.. సీఎం జగన్

ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేశామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. విద్యారంగంలో నాడు-నేడు పై ఏపీ అసెంబ్లీలో చర్చ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… చంద్రబాబు హయాంలో ప్రభుత్వ పాఠశాలలను గాలికొదిలేశారన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం అలా గాలికొదిలేశారో ప్రశ్నించాల్సిన అవసరముందన్నారు. చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలో కూడా ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ స్కూళ్లను పట్టించుకోలేదన్నారు. ఆడబిడ్డలకు కూడా టాయిలెట్లు లేని పరిస్థితి ఉండేదన్నారు. ఉన్నత విద్యను హక్కుగా మార్చామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement