Thursday, May 2, 2024

పవన్, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేస్తాం.. అనిల్ కుమార్ యాదవ్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులను బంగాళాఖాతంలో కలిపేస్తామని ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు కౌంటర్ గా ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. తనకే చెప్పులున్నట్లు పవన్ మాట్లాడారన్నారు. తాము అంతకన్నా ఎక్కువగా మాట్లాడగలమన్నారు.

6శాతం ఓటింగ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడితే.. 50శాతం ఓటింగ్ ఉన్న తాము మీదపడితే ఏమవుతుందో ఊహించుకోవాలన్నారు. చంద్రబాబు, పవన్ లు ఇద్దరూ వచ్చినా ఏమీ పీకలేరన్నారు. మరోసారి పవన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని హెచ్చరిస్తున్నానన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఇలా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. 12ఏళ్లు తనను ఎంతో తిట్టి, ఇబ్బంది పెట్టినా చిరునవ్వుతో వాటిని అధిగమించి సీఎం అయిన వ్యక్తి జగన్ అన్నారు. నాయకుడంటే ఎలా ఉండాలన్న దానికి జగన్ ఉదాహరణ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement