Tuesday, May 7, 2024

ఇద్ద‌రు పోలీసుల‌పై వాచ్ మెన్ దాడి..

ఇద్ద‌రు పోలీసుల‌పై వాచ్ మెన్ దాడి చేసిన ఘ‌ట‌న విశాఖప‌ట్నం జిల్లా కాకణి నగరంలో చోటుచేసుకుంది. మద్యం మత్తులో వాచ్ మెన్ హల్ చల్ చేశాడు. 100కు డ‌య‌ల్ ఫిర్యాదుతో ఇద్దరు కానిస్టేబుళ్లు కిశోర్, కృష్ణారావు సాయి ప్రియ అపార్ట్ మెంట్ కు వెళ్లారు. అయితే ఇద్దరు కానిస్టేబుల్స్ పై వాచ్ మెన్ గోపి రాడ్ తో దాడి చేశాడు. అయితే వీరిలో ఓ కానిస్టేబుల్ ప్రమాద స్థితిలో ఉన్నట్లు సమాచారం. మెరుగైన చికిత్స కోసం పోలీసులు సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement