Saturday, April 27, 2024

గుండెపోటుతో రష్యా మెరైన్ ఇంజినీర్‌ విశాఖలో మృతి

విశాఖప‌ట్నం : రష్యా నుండి వచ్చిన మెరైన్ ఇంజినీర్‌ గుండెపోటుతో విశాఖలో మృతిచెందారు. రష్యా దేశానికి చెందిన గ్రాచవ్‌ దిమిత్రి (43) ఈ ఏడాది ఫిబ్రవరి 27న విశాఖ వచ్చారు. ఇండియన్‌ నేవీకి చెందిన సబ్‌మెరైన్‌ నౌకలో సాంకేతిక లోపం ఏర్పడడంతో వాటిని సరిచేసేందుకు ఆయనను ఇక్కడికి పిలిపించారు. డాల్ఫిన్‌ హిల్స్‌ ప్రాంతంలోని క్వార్టర్‌లో ఆయ‌న ఉంటున్నారు. కాగా, విశాఖ నేవీ యార్డ్ లో శుక్రవారం ఉదయం నౌకలో పనులు చేస్తుండగా మ.1.15 గంటల ప్రాంతంలో అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. అక్కడి సిబ్బంది వెంటనే ఆయనను ఐఎన్‌ఎస్‌ కల్యాణి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మ.2.45 గంటలకు మృతిచెందారు. నేవల్‌ అధికారుల ఫిర్యాదు మేరకు మల్కాపురం సీఐ కూన దుర్గాప్రసాద్‌ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement