Monday, May 13, 2024

అమ్మఒడిలో ఎస్సీ, ఎస్టీల‌కు అన్యాయం : టీడీపీ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి

జగన్ హయాంలో గిరిజనుల సమస్యలు పెరిగాయని.. గిరిజనులకు పూర్తిగా సంక్షేమ పథకాలు అందడం లేదని టీడీపీ నాయకురాలు గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. అమ్మఒడిలో ఎస్సీ, ఎస్టీలకు జగన్ తీవ్ర అన్యాయం చేశారన్నారు. లబ్దిదారుల సంఖ్యను సైతం బాగా తగ్గించారన్నారు. ఇంటింటికి రేషన్‌లో సర్కార్ పూర్తి వైఫల్యం చెందిందన్నారు. చంద్రబాబు హయాంలో పెట్టిన అన్ని సంక్షేమ పథకాలను ఎత్తివేశారన్నారు. వంగలపూడి అనితపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. బహిరంగ సభల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement