Tuesday, May 7, 2024

అమర్‌నాథ్‌ యాత్రలో అనకాపల్లి వాసి మృతి

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనకాపల్లి వాసి అమర్‌నాథ్‌ యాత్రలో అనారోగ్యంతో మృతి చెందారు. గవరపాలెం నీలకంఠం వీధికి చెందిన బోడాల సూరి అప్పారావు ఈనెల 2న 15 మందితో కలసి అమర్‌నాథ్‌ యాత్రకు బయలు దేరారు. బద్రినాథ్‌లో దర్శనం చేసుకుని అక్కడే రాత్రి బస చేశారు. అప్పరావుకు రాత్రి ఊపరాడక పోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అప్పారావు మృతదేహాన్ని అనకాపల్లికి తరలించేందుకు ప్రభుత్వం సహకరించాలని మృతుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement