Sunday, May 19, 2024

బాలాసాహెబ్ భావజాలానికి, సిద్ధాంతానికి ద్రోహం చేయను-సీఎం ఏక్ నాథ్ షిండే

బాలాసాహెబ్ భావ‌జాలానికి..సిద్ధాంతానికి ద్రోహం చేయ‌బోన‌ని మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తెలిపారు. మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సోష‌ల్ మీడియా ద్వారా గురి పూర్ణిమ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ట్విట్ట‌ర్ లో బాలాసాహెబ్ ఠాక్రే ఫొటో ను షేర్ చేశారు. హిందుత్వం లేని ఆలోచన లేదు. గురు పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలన చెప్పారు. సాధార‌ణంగా గురు పూర్ణిమను హిందువులు, జైనులు బౌద్ధులు మ‌త‌స్తులు జ‌రుపుకుంటారు. తమ జీవితాలను జ్ఞానోదయం వైపు నడిపించే గురువులను గౌరవించటానికి, గుర్తు చేసుకునేందుకు నిర్వ‌హించుకుంటారు. అయితే ఏక్ నాథ్ షిండే త‌న గురువు బాలా సాహెబ్ అని త‌ర‌చూ చెబుతుంటారు. ఈ నేప‌థ్యంలోనే గురు పూర్ణిమ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement