Thursday, April 25, 2024

సమన్వయం చేసుకుంటూ సహకారం అందించాలి : మంత్రి వేముల

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, సమన్వయంతో ముందుకు సాగాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వర్షాలపై నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవారం మంత్రి వేముల ఫోన్లో సమీక్షించారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement