Wednesday, May 1, 2024

Chhattisgarh : జ‌వాన్‌లు,మావోల‌కు మ‌ధ్య కాల్పులు.. జవాన్ మృతి..

ఛత్తీస్‌గఢ్‌లో మ‌రోసారి జ‌వాన్‌లు, మావోల మ‌ధ్య కాల్పులు జ‌రిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఒక జవాను తన ప్రాణాలను కోల్పోయారు.

- Advertisement -

దంతెవాడ జిల్లా బార్సూర్ పరిధిలోని హందవాడ, హితవాడలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో డీఆర్‌జీ ( డిస్ట్రిక్ట్ రిజర్వ్‌డ్ గార్డ్ ) పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా.. పోలీసుల కదలికలను కనిపెట్టిన మావోయిస్టులు.. ఒక్క సారిగా కాల్పులు చేయడం ప్రారంభించారు.

కాగా, మరో వైపు నుంచి కూడా పోలీసులు కాల్పులు చేయడంతో ఈ కాల్పుల్లోనే దంతెవాడ డీఆర్‌జీ కానిస్టేబుల్ జోగరాజ్ కర్మ మృతివాత పడ్డాడు. మరో కానిస్టేబుల్ పరశురామ్‌కు సైతం తీవ్ర గాయాలయ్యాయి. ఇక, కానిస్టేబుల్ పరశురామ్‌ను చికిత్స నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇక, కాల్పుల్లో ఇద్దరు మవోయిస్టులకు సైతం గాయాలు అయినట్లు సమాచారం. కాగా, ఎదురు కాల్పులు చోటు చేసుకున్న ప్రాంతంలో భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement