Tuesday, April 23, 2024

ఆరోగ్యశ్రీతో అందించే చికిత్సలను పెంచాలి.. సీఎం జగన్

ఆరోగ్య శ్రీ ద్వారా అందించే చికిత్సలను పెంచాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. వైద్యారోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ… ఆరోగ్య శ్రీ ద్వారా పెంచే చికిత్సలను ఆగస్టు 1నుంచి అమలు చేయాలన్నారు. ఆగస్టు 15నుంచి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. కరోనా వ్యాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కొత్త వైద్య కాలేజీల నిర్మాణ పనులను వేగవంతం చేయాలన్నారు. మెడికల్ కాలేజీల్లో త్వరగా తరగతులు నిర్వహించేలా ప్రణాళికలతో ముందుకెళ్లాలన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement